సీతానగరంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం: సీతానగరం మండలంలో గురువారం పలు కుటుంబాలను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. చిన్నకొండెపూడి గ్రామానికి చెందిన చిడిపి నగేష్ కుమార్తె అనారోగ్యంతో బాదపడుతున్న విషయం తెలుసుకుని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. ముగ్గళ్ల గ్రామంలో చెల్లూరి సందీప్ కు ఇటీవల గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకుని వారిని పలకరించు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాటవరం గ్రామంలో కట్రగడ్డ సూరిబాబుకు ఇటీవల రెండు కాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుసుకుని వారిని పలకరించు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన నాయకులు పెంటపాటి శివ, బొల్లి సుబ్రహ్మణ్యం, అబ్బులు చౌదరి, మట్ట వెంకటేశ్వర రావు, దాసరి రమేష్, చిక్కం నాగేంద్ర, తన్నీరు సురేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు, వీరమహిళ వనుము వెంకట లక్ష్మి, కోనే శ్రీను, చిట్టి త్రిమూర్తులు, కంగళ్ల రఘు, అడబాల బాబీ, గుర్రాల చలం, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.