గాదెను అభినందించిన నాదెండ్ల
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావును కాకినాడ టౌన్ కి ఇంచార్జిగా నియమించడం జరిగినది. కావున కాకినాడలో వారాహి యాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ అర్బన్ ఇంచార్జ్ గాదె వెంకటేశ్వరరావు ను వారాహి యాత్ర కాకినాడలో విజయవంతంగా ముగిసిన సందర్భంగా వారు గత 8 రోజుల నుండి కాకినాడలోనే ఉండి, పార్టీ ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించినందుకు వారిని, వారి టీమ్ ను అభినందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/gade1-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-20-at-2.03.54-PM-1024x682.jpeg)