ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో వంగవీటి జయంతి వేడుకలు

మార్కాపురం నియోజకవర్గం: మార్కాపురం పట్టణం నందు స్వర్గీయ శ్రీ వంగవీటి రంగా జయంతి సందర్భంగా మంగళవారం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో వంగవీటి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, శిరిగిరి శ్రీనివాసులు, బెల్లంకొండ రామక్రిష్ణ, పేరూరి రమేష్ మరియు కాపు సంఘం నాయకులు శాసనాల వీరబ్రహ్మం, రఘుపతి శివ, తిరుపతయ్య, పత్తి వెంగన్న, పత్తి చంద్ర, పి.వి. క్రిష్ణారావు, బండారు శ్రీను, గురవయ్య, తిరుమలశెట్టి రామయ్య, ఆకుల గిరీ, మట్టం శ్రీనులు పాల్గొన్నారు.