రెడ్డి సామాజిక వర్గానికే అన్ని పదవులు కట్టపెట్టడం సమంజసమా?

పాలకొండ: ముఖ్యమంత్రి అనే వ్యక్తి అన్ని జాతులని సమానంగా చూడాలి, గానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం కేవలం రెడ్డి సామాజిక వర్గం వారికే అన్ని పదవులు కట్టపెట్టడం తప్పుడు పద్ధతి. ఈ విషయంపై వైసీపీ పెటియం గాళ్ళు పాలేరు గాళ్ళు స్పందించకపోయినా ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేను మాత్రం వ్యతిరేకిస్తున్నానని జనసేన జానీ పేర్కొన్నారు. శనివారం జానీ పత్రికాముఖంగా మాట్లాడుతూ సీఎం గారికి సూటి ప్రశ్నలు వేశారు. అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటో తెలుసా తిరుపతి ఎస్పీ రెడ్డిగారు, తిరుపతి కలెక్టర్ రెడ్డి గారు, తిరుపతి ఆర్డీఓ రెడ్డి గారూ, తిరుపతి ఎమ్మెల్యే రెడ్డి గారూ, తుడా ఛైర్మెన్ రెడ్డి గారు, టీటీడీ బోర్డు చైర్మన్ రెడ్డి గారు, టీటీడీ ఈఓ రెడ్డి గారు, ఎస్వీ యూనివర్సిటీ విసి రెడ్డి ఇలా రెడ్డి సామాజిక వర్గానికి అన్ని కీలక పదవులు ఒక్క పాలక వర్గానికే పోతే మిగిలిన వర్గాల మాటేమిటి 90 శాతం ఉన్నా నా తాదిత, పీడిత బాధిత వర్గాలకు పదవులు దక్కేది ఎప్పుడూ ఆలోచించండి ఇదేనా సామాజిక న్యాయం ఎన్నాళ్లీ వివక్షత ఇంకానా? ఇంకెన్నాళ్ళు ఈ పద్ధతులు మారాలి అంటే కచ్చితంగా జనసేన ప్రభుత్వం రావాలని జనసేన జానీ అన్నారు.