జనసేన కార్యకర్త శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ తాళ్లరేవు మండలం చల్లంగి పేట గ్రామంలో గుండెపోటుతో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కారి శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, జనసేన పార్టీ తరఫున బాలకృష్ణ హామీ ఇచ్చారు. వీరి వెంట మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, దూడల స్వామి, గ్రామ ప్రెసిడెంట్ రేలంగి శ్రీను, కుందు దుర్గా ప్రసాద్, మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.