జనసైనికుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం చేసిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లికి చెందిన జనసైనికుడు లింగిశెట్టి శ్రీనివాస్ అనారోగ్య కారణంగా శుక్రవారం మరణించడం జరిగినది. ఈ విషయాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు గారికి తెలియజేయగా శనివారం వడ్డవలిలోని వారి గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం చేయడం జరిగినది. జనసేన పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, షేక్ రఫీ, రామిశెట్టి శ్రీను, కోటికలపుడి లక్ష్మీనారాయణ, సిసింద్రీ, రాఘవ పాల్గొనడం జరిగినది.