నంద్యాల జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నంద్యాల నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ ఆధ్వర్యంలో నంద్యాల విజయ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 100 యూనిట్ల రక్తాన్ని జనసైనికులు ఇవ్వనున్నట్లు తెలిపారు. డొనేట్ చేసిన రక్తాన్ని తలసేమియాతో భాధపడుతున్న పిల్లలకు ఇవ్వనున్నట్లు తెలిపారు.