వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం

  • జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేసి బెయిలుఫై త్వరగా బయటకు రావాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరియు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో ముస్లిం మత గురువులచే ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఈ సందర్భంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులు కార్యకర్తలు, జనసేన సానుభూతిపరులపైన అక్రమ కేసులు పెట్టి కక్ష్య సాధింపుకు పాల్పోడుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త మదనపల్లి ధ్యేయంగా జనసేన పార్టీ టిడిపి పార్టీ కలసి పనిచేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రామసముద్రం మండల ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, రెడ్డెమ్మ, జనార్దన్, చంద్రశేఖర, లవన్న, పవన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.