అబ్దుల్‌ కలాం సేవలు మరువలేనివి: గురాన అయ్యలు

విజయనగరం: శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అని జనసేన నేత గురాన అయ్యలు కొనియాడారు. ఏపీజే అబ్దుల్‌కలాం జయంతి వేడుకలు జనసేన కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ భారత క్షిపణి పితామహుడు, రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎపిజె.అబ్దుల్‌ కలాం అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవ చిరస్మరణీయం అన్నారు. నిరుపేద కుటుంబం నుంచి తన ప్రతిభతో దేశ అత్యున్నత స్థాయికి ఎదిగిన అబ్దుల్‌ కలాం జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రేగిడి లక్ష్మణరావు, రేవళ్ల పైడినాయుడు, వజ్రపు నవీన్ కుమార్, ఎమ్ పవన్ కుమార్, అడబాల వేంకటేష్, వెంకట రమణ, కంది సురేష్, పృథ్వీ భార్గవ్, కె.సాయి, కంకిపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.