శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

విజయనగరం నియోజకవర్గం: విజయనగరం మండలం, కోరుకొండ గ్రామం నుంచి ఆదివారం సుమారుగా 50 మంది వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వీరందరికి శ్రీమతి పాలవలస యశస్వి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి పాలవలస యశస్వి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ బాగా కృషిచేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొబ్బాది చందు నాయుడు రాంబాబు సమక్షంలో గ్రామస్తులు చేరడం జరిగింది.