చింతలమోరి ఉప సర్పంచ్ గా కొల్లు ప్రకాష్

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, చింతలమోరి పంచాయతీకి నూతన ఉప సర్పంచ్ గా కొల్లు ప్రకాష్ నియమితులైనారు. ఈ కార్యక్రమంలో చింతలమోరి సర్పంచ్& రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, జనసేన పార్టీ మలికిపురం మండల కార్యదర్శి పొన్నమండ సత్యనారాయణ, రాపాక ఈశ్వరరావు, సిద్దయ్య, దొడ్డ చిన్న, దొడ్డా రాంబాబు, మైనం తాతయ్య, రాలీ శ్రీనివాస్, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.