ఘనంగా గోపాల్ నగర్ బిజేపి-జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం
తెలంగాణ, కూకట్పల్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజేపి బలపరచిన జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కూకట్పల్లి నియోజకవర్గంలో గల గోపాల్ నగర్లో గోపాల్ నగర్ బిజేపి-జనసేన ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగ బిజేపి-జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బిజేపి బలపరచిన జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ తమ అమూల్యమైన ఓటును జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-14-at-21.21.27-1024x576.jpeg)