రాజశ్యామల యాగశాలను దర్శించిన జనసేన నాయకులు
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో జరుగుతున్న శ్రీ శతకుండాత్మక, మహారుద్ర, శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగం వీక్షించుటకు యాగశాలకు జనసేన ఇంచార్జ్ లు జనసేన ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ జుత్తుక నాగరాజు, నరసాపురం నియోజకవర్గం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్, గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, రాజమండ్రి డి.ఎస్.పి శ్యామ్ సుందర్ లు విచ్చేసారు. వీరికి సాదర రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ స్వాగతం పలికారు. యాగశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై వీరిని దుశ్శాలువలతో సత్కరించి “ఓం శివ శక్తి పీఠం” విశిష్టతను తెలియజేసే చిత్రపటాన్ని బహుకరించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-8.12.06-PM-1024x684.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-8.12.07-PM-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-8.12.06-PM-1-1024x683.jpeg)