తిరుపతి వైసీపీ గల్లీ నాయకులకి తగిన గుణపాఠం చెప్తాము – డా. పసుపులేటి

  • కులాల పేరుతో దూషిస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్న తిరుపతి వైసీపీ గల్లీ నాయకులకి తగిన గుణపాఠం చెప్తాము – డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపేవిధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం దిశగా ముందడుగు వేస్తుంటే తిరుపతి లోని గల్లీ వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్టన్ జరిగే సమయంలో బలిజ మరియూ యాదవులు రాజకీయం చేయాలా అని నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతూ అవమానించటం చాలా బాధను కలిగించే ఘటన అని ఇటువంటి వైసీపీ గల్లీ నాయకులకు తొందర్లో తగిన గుణపాఠం చెప్తాము అని డా.పసుపులేటి హరిప్రసాద్ హెచ్చరించారు. అలాగే తిరుపతి ఎం అభివృద్ధి చేసారని మీకు దమ్ము దైర్యం ఉంటే ప్రజలదగ్గర చేర్చకి రావాలని సవాళ్లు విసిరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి ఆనంద్, తిరుపతి ఉపధ్యక్షులు బాబ్జి, రాజేష్ ఆచారి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.