దోషులను గుర్తించి శిక్షించాలి
విజయనగరం: బుధవారం జరిగిన టీడీపీ-జనసేన యువగళం సభకు విచ్చేసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రజిని సభ అనంతరం వెళుతుండగా దారిలో ఆమెను పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఆరుగురు దుండగులు చెప్పరాని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఆమె సెల్ ఫోన్ లాక్కొని ఆమెపై బాలత్కారం చేయబోయారు. ఇంతలో జనసేన కార్యకర్తలు రావడంతో వారు బైకులలో పారిపోయారు. ఈ విషయాన్ని గురువారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి అయిన శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో బాధితురాలితో పాటు డి ఎస్ పిని కలిసి దోషులను గుర్తించి తగిన చర్యలు తీసుకొని వారిని శిక్షించ వలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ ప్రెసిడెంట్ సానక సుబ్రహ్మణ్యం, తుమ్మి లక్ష్మి, శ్రీమతి మాత గాయత్రి, పుష్ప, పద్మ, రౌతు సతీష్, ఎర్నాగుల చక్రవర్తి, కిలారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-21-at-9.28.48-PM-1024x576.jpeg)