వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కొత్తపల్లి జనసైనికులు

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం కొత్తపల్లి గ్రామం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన – టీడీపీ నాయకులు మాట్లడుతూ 7 ఏళ్ల రాజకీయాలలో ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ పేదలకు ఇళ్ల పట్టాలు కోసం రంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కిరాయి మూకలు హత మార్చడం తద్వారా అయన మరణాంతర నుండి ఇప్పటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు, రంగా ఏ ఒక్క కులానికి చెందిన వారు కాదని అయన అన్ని కులాలకు ఆరాధ్యదైవమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకుడికి లేనంతగా సుమారు 2లక్షలపై విగ్రహాలు ఉన్న ఏకైక దైవం ఒకే ఒక్క రంగా అని, మేము మిమ్మల్ని చూడకపోయినా చరిత్రకే చెమటలు పట్టించిన మీ చరిత్ర చెబుతుంది మీ గురించి, మీ ఆశయాలు ఎప్పటికి మా గుండెల్లో పదిలంగా ఉంటాయి అని తెలిపారు. కంటితో నిన్ను చూడలేకపోయిన, మా గుండెల్లో నింపిన ఆశయం మా కడ శ్వాస వరకు బ్రతికే ఉంటుంది అని కొత్తపల్లి జనసైనికులు తెలిపారు. వంగవీటి మోహన రంగా ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తూ, రంగా ఆశీషులతో త్వరలో ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తామని ఏద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గం జనసేన-టీడీపీ సమన్వయకర్త బీవీ రావు, కైకలూరు నియోజకవర్గం జనసేన నాయకులు మోటేపల్లి హనుమాన్ ప్రసాద్, టీడీపీ నాయకులు కొడాలి వినోద్ మరియు ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.