ప్రతి జనసేన కార్యకర్త సైనికుడిలా ఎదగాలి

శింగనమల, మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం జనసేన పార్టీకార్యకర్తల సమావేశం జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల హరి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు చొప్పా చంద్ర జిల్లా సంయుక్త కార్యదర్శి కిరణ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ లు మాట్లాడుతూ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ,అలాగే అమలు కానీ హామీలను ఇచ్చి ప్రభుత్వం ఈ రోజు ప్రజలను తప్పుదోవ పట్టించే పాలన సాగిస్తోందని విమర్శలు చేశారు. అదే విధంగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి దాని యొక్క అవసరాన్ని కార్యకర్తలందరికీ తెలియచేసి ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ కి రాయలసీమ లో ముఖ్యంగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం అంటే ఎంతో ప్రేమ అని దానికి సూచికగా రాయలసీమ మహిళ ప్రాంతీయ కమిటీ లో మన నియోజకవర్గానికి సంబంధించిన వీర మహిళలు శ్రీమతి పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి గార్లను సభ్యురాలుగా తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. కార్యకర్తలు నాయకులు అందరూ కలసి సింగనమల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయాలని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందన్నారు. గార్లదిన్నె నుండి నియోజకవర్గ కేంద్రానికి రావాలంటే రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉందని ఇంకా గ్రామాలకు వెళ్ళే రోడ్లు ఏవిధంగా ఉంటాయో అర్థం అవుతుందన్నారు. మండల స్థాయి అధికారుల చేతుల్లో అధికారం లేకుండా చేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు వైసిపి నాయకులు అధికార దాహంతో సొమ్మును కూడగట్టుకునే యత్నాలు చేస్తున్నారని ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు గుప్తించి అధికారం వచ్చిన తర్వాత రైతులకు స్ప్రింక్లర్లు డ్రిప్పులు పైపులు ఇవ్వకుండా రైతులను దగా చేస్తున్నారన్నారు ప్రతిజన సైనికుడు క్రియాశీలక సభ్యుడు గా నమోదు చేసుకోవాలని ప్రతి కార్యకర్తకు భరోసా ఉండాలని 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేయాలన్నదే ద్యేయంగాప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో భూకబ్జాలు దోపిడిలు దౌర్జన్యాలు అరాచకాలు ఎక్కడా చేయలేదని కష్టపడిసినిమాలు తీస్తూ సంపాదించి పార్టీ కోసం కార్యకర్తల కోసం ఖర్చు చేస్తున్నారన్నారు దీన్ని చూసి అధికార ప్రతిపక్ష పార్టీలు ఓర్వ లేక పోతున్నాయని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామన్నారు అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి యువకులకు కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గ కార్యదర్శి మురళీకృష్ణ నియోజకవర్గ మండల అధ్యక్ష కార్యదర్శులు శింగనమల మండల అధ్యక్షులుతోట ఓబులేసు నాయకులు దండు హరి మధు సాయి కుమార్ సంతోష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.