నాలుగో టెస్ట్ నుంచి బుమ్రా ఔట్..
అహ్మదాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు 4వ తేది నుంచి మొతేరా స్టేడియంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు ముందే భారత్కు గట్టి షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను నాలుగో టెస్టుకు ఆడట్లేదు. ఈ మేరకు బిసిసిఐ తాజాగా ప్రకటించింది. వ్యక్తిగత కారణాల వల్ల తనను నాలుగో టెస్ట్ జట్టు నుండి తప్పించాలని బుమ్రా కొరినట్లు బిసిసిఐ ప్రకటించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 3 టెస్టుల్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అయితే భారత్ ఈ టెస్ట్ సిరీస్ను సొంతం చేసుకోవాలన్నా.. అలాగే జూన్లో జరిగే ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకోవాలన్నా ఈ చివరి టెస్టులో విజయం అయిన దక్కించుకోవాలి.. లేదా డ్రా అయిన చేసుకోవాలి.
NEWS – Jasprit Bumrah released from India’s squad
— BCCI (@BCCI) February 27, 2021
Jasprit Bumrah made a request to BCCI to be released from India’s squad ahead of the fourth Test owing to personal reasons.
More details – https://t.co/w2wlfodmq8 #INDvENG pic.twitter.com/mREocEuCGa