కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు- 89
పబ్లిక్ ప్రాసిక్యూటర్- 43
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్- 26
అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్)- 10
ఎకనమిక్ ఆఫీసర్- 1
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బాలిస్టిక్స్)- 1
ప్రోగ్రామర్ గ్రేడ్ ఏ- 1
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజీ)- 2
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (కెమిస్ట్రీ)- 2
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (డాక్యుమెంట్స్)- 2
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (లై డిటెక్షన్)- 1
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 18
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2021 మార్చి 19
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీస్ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతనం- ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన స్కేల్ వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు- రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
అప్లై చేయండి ఇలా:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS పైన క్లిక్ చేయాలి.
అందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
దరఖాస్తు చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన Apply Now లింక్ క్లిక్ చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.