వరదయపాలెం మండలంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

సత్యవేడు నియోజకవర్గం: వరదయపాలెం మండలం,
బతలవల్ల పంచాయతీలో ఆదివారం వరదయ్య పాలెం మండల అధ్యక్షులు అంబటి చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో జనసేన నాయకుడు కుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన బతలవల్లం పంచాయితీ పరిదిలోని చదులపకం నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ జనసేన & తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిచాలని చెప్పడం జరిగింది. కుల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజ ప్రభుత్వాన్ని మనమంతాగెలిపించుకోవాలి జనసేన&తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిచాలని చెప్పడం జరిగింది. మండల ఉపాధ్యక్షులు తొండంబట్టు శేఖర్ & దేవళ్ళ తులసి రామ్ మాట్లాడుతూ జనసే పార్టీ తరుపున బూత్ స్థాయిలో బలంగా పనిచేయాలని జనసైనికులకు చెప్పడం జరిగింది. ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడూతూ.. వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది, గెలుపుకంటే కూడా మెజార్టీ ముఖ్యమని, సత్యవేడు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలని తెలియజేసారు. మండల అధ్యక్షుడు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం, మండల నాయకులు దినేష్, సంయుక్త కార్యదర్శి యుగంధర్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.