రజకుల అభ్యున్నతి జనసేన, తెలుగుదేశం పార్టీలతోనే సాధ్యం

  • 48వ డివిజన్ రజకనగర్ లో కొనసాగిన మహిళలతో మాటామంతి కార్యక్రమం 45వ రోజు
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 45వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 48వ డివిజన్ రజక నగర్ లో పర్యటించి మహిళలతో మమేకమే స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలనా కాలం లో రజకులు అనచివేతకు గురవుతున్నారని ఇప్పటికి రజకులు అనేక ఆర్థిక సాంఘిక ఇబ్బందులకు గురై సమాజంలో వెనకబడ్డారని జనసేన టిడిపి అధికారంలోకి రాగానే రజకులను అన్ని రకాలుగా ఆదుకొని వారిని ఎస్టీల్లోకి చేర్చే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని.. రజకుల అభ్యున్నతికి బీసీ డిక్లరేషన్ లో కూడా ప్రత్యేక స్థానం కల్పించారని ఇవన్నీ గమనించి రజక సోదర సోదరీమణులు తప్పకుండా జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిని ఆశీర్వదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.