జనసేనకు ఎన్నారైలు అందిస్తున్న సేవలు ప్రసంశనీయం: నేరేళ్ళ సురేష్

గుంటూరు, అవినీతి, బంధుప్రీతి, కులపిచ్చితో కలుషితమైన రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ప్రస్థానం చారిత్రాత్మకమని నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ నెల 14న జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లండన్లో బర్మింగాంలో జనసైనికులు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన గోడప్రతులను మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నా మాతృభూమిపై మక్కువతో రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఎన్నారైలను ఆయన అభినందించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీకి ఆరంభం నుంచి పూర్తి మద్దతు ఇస్తూ పార్టీకి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ నేపధ్యంలో ఈ నెల 9 న లండన్ లో 10 న బర్మింగాంలో జనసేన ఆవిర్భావ వేడుకలు జరపడం ఎంతో ముదావహం అని నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షుడు చింతా రేణుకారాజు, నగర కమిటీ సభ్యులు మిద్దె నాగరాజు, పులిగడ్డ గోపి, డివిజన్ అధ్యక్షులు గడ్డం రోశయ్య, శాంతికుమార్, యజ్జు రాజేష్ ఖన్నా, పులిగడ్డ నాగేశ్వరరావు, సురేష్, జగ్గా శేషగిరిరావు, శివనాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.