టోక్యో ఒలింపిక్స్లో విదేశీ ప్రేక్షకులకు నో ఎంట్రీ
జపాన్: ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గతేడాది విశ్వక్రీడలు జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది. కరోనా తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ఒలింపిక్స్ గేమ్స్కు విదేశీ ప్రేక్షకులను అనుమతించకూడదని జపాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ ప్రేక్షకులు లేకుండానే సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించనున్నారు. టార్చ్ రిలే కూడా క్రీడాభిమానులు లేకుండానే జరగనుంది. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరగనున్నాయి.