టెక్సాస్లో కాల్పులు..ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్లోని నైరుతి హోస్టన్లో బుధవవారం ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, ఒక వ్యక్తి గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వెలుపల బుధవారం రాత్రి 11 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. కాంప్లెక్స్ పార్కింగ్ స్థలం వద్ద ఓ విషయంపై రెండు బృందాల మధ్య వివాదం చెలరేగింది. ఓ బృందంలోని ఐదుగురు సభ్యులు..మరో ఇద్దరికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు మరొక బృందంపై కాల్పులు జరపడంతో 18 ఏళ్ల వయస్సు కలిగిన యువతీయువకులు ఇద్దరు చనిపోగా…మరో 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. గాయ పడిన యువతిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. నిందితులు కాల్పులు చేసి అక్కడి నుండి పరారయ్యారని, వారి గురించి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.