కరోనా నుండి కోలుకున్నా… ప్లాస్మా దానం చేస్తా…సీఎం శివరాజ్ సింగ్

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా రోగుల కోసం తాను ప్లాస్మాను దానం చేస్తానని ప్రకటించారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జులై 25వతేదీన కొవిడ్ -19తో ఆసుపత్రిలో చేరగా 11 రోజుల పాటు చికిత్స అనంతరం కోలుకోవడం జరిగిoది. ఆగస్టు 5వతేదీన సీఎంను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఆదివారం సీఎం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు.” నేను కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాను. నా శరీరంలో యాంటీ బాడీలు కరోనాతో పోరాడాయి. నేను త్వరలో ప్లాస్మాను కరోనా రోగులకు దానమివ్వాలనుకుంటున్నాను” అని సీఎం శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.