చెక్ పోస్టుల్లో డిజిటల్ టర్నింగ్‌!

నిడదవోలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చెక్ పోస్టుల్లో పారదర్శకత కోసం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ డిజిటల్ చెల్లింపుల పథకాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలిలోని చెక్ పోస్టు వద్ద ఈ డిజిటల్ వసూలు పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. ఇప్పటి వరకు నగదుగా వసూలు చేస్తున్న మార్కెట్ ఫీజులను ఇకపై ఈ-పాస్ యంత్రాల ద్వారా డిజిటల్‌గా వసూలు చేయనున్నారు. ఇది ఆదాయంలో పారదర్శకతకు దోహదం చేయడంతో పాటు, అక్రమాల నిరోధానికి కీలక అడుగుగా నిలవనుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో తూర్పుగోదావరి కలెక్టర్ పి.ప్రశాంతి, ఇతర అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment