తెలుగు ప్రజలకు రాష్ట్రపతి-ప్రధాని ల ఉగాది శుభాకాంక్షలు

ఢిల్లీ: నేడు ఉగాది పండుగను పురస్కరించుకొని.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడి లు తెలుగు ప్రజలకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్వీట్‌ చేశారు.

‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను’ అని మోడి ట్వీట్‌లో పేర్కొన్నారు.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *