గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. గంగూలీ గుండెపోటుతో బాధపడుతు కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ సాయంత్రానికి ఆయనకు యాంజియోప్లాస్టీ చేయనున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఛాతిలో నొప్పి కారణంగానే ఆయన శనివారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *