74 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రుడు

అనంతపురం ప్రజలకు ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసారు. ఈనాటి మన స్వాతంత్ర్యం వెనుక ఎంతో మంది మహనీయుల బలిదానం ఉందని,  మనందరం ఈ రోజు స్వతంత్ర భారతావని లో నివసించేలా చేసిన ఆ మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు మరియు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన కనీస బాధ్యతని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ప్రతి  మహనీయునికి  ఘన నివాళులు అర్పిస్తున్నానని మరియు శతకోటి వందనాలని తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవ శుభదినాన రెపరెపలాడే మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వేడుకలలో పాల్గొని దేశభక్తి గీతాలను వినడం మనందరిలో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.

 ఈ సంవత్సరం  కరోనా కారణంగా పరిమితుల మధ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సేవలందించిన ప్రతి పౌరునికి ఈ సందర్భంగా తన అభినందనలు తెలియచేశారు. జిల్లా ప్రజలందరు చక్కటి ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తుతో సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తమ జిల్లాను అభివృద్ధి పథంలో పయనించేలా ప్రజలందరు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.