తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అంతకుముందు గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్దకు సీఎం వెళ్లి నివాళులర్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.