అత్యంత ఖరీదైన పెన్ను.. ధర అక్షరాలా రూ.7 లక్షలు..!

ఎవరైనా పెన్నును ఎంతకు కొంటారు.. రూ.10. కాస్త కాస్ట్‌లీగా, విభిన్నంగా ఉండే పెన్ను కావాలంటే.. రూ.వేలల్లో కొంటారు. కానీ ఓ పెన్ను ధర ఏకంగా రూ.7 లక్షలు..! అవునండీ.. ఏంటీ ఆ పెన్ను ప్రత్యేకత అనుకుంటున్నారా? బంగారంతోపాటు అత్యంత విలువైన రాళ్లను ఉపయోగించి ఈ పెన్నును తయారుచేశారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘కరన్‌డాష్‌’ సంస్థ రూపొందించిన ఈ కలం.. ఖాతాదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల బెంగళూరులోని కోరమంగళలో విలియమ్‌ పెన్స్‌ సంస్థ రూ.7 లక్షల విలువైన ఈ కలాన్ని విక్రయానికి ఉంచింది. ఈ సంస్థ 20 ఏళ్లుగా బ్రాండెడ్‌ కలాలకు చిరునామాగా నిలుస్తోంది. బంగారంతో, అత్యంత విలువైన రాళ్లతో మెరిసిపోతున్న ఈ బంగారు కలాన్ని ఎవరు చేజిక్కించుకుంటారో..!