రైల్వే శాఖపై కేంద్రం ముఖ్య నిర్ణయం..!

రైల్వే శాఖపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్ (ఐఆర్‌సీటీసీ) లోని తన వాటాల్లో కొంత షేర్ల భాగాన్ని ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టబడలకు సంబంధించిన సంస్థ (డీఐపీఏఎం) అమ్మకాల ప్రక్రియను నిర్వహించడానికి సెప్టెంబర్ 10 లోగా సెబీలో నమోదు చేసుకున్న మర్చంట్ బ్యాంకర్ల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది.