ఎయిరిండియా బిడ్‌ గడువు పొడిగింపు

కొవిడ్‌-19 కారణంగా ఎయిరిండియా వాటాల విక్రయానికి సంబంధించి బిడ్‌లను వేసేందుకు విధించిన గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన అడ్డంకులను పరిగణనలోనికి తీసుకొని, ఈ గడువును పెంచినట్లు పేర్కొంది. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటాల విక్రయానికి జనవరి 27న ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పటి నుంచి పలు మార్లు గడువును పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం ఇది ఆగస్టు 31 వరకూ ఉండగా, తాజా పెంపుతో అక్టోబరు 30 వరకూ బిడ్లను దాఖలు చేసేందుకు వీలుంది.