తిరుపతి-కృష్ణానగర్: కూలడానికి సిద్ధంగా ఉన్న మూడంతస్తుల భవనం

మౌనంగా ఉన్న కుటుంబాలకు వసతి కల్పించాలని జనసేన నాయకులు డిమాండ్

తిరుపతిలోని కృష్ణానగర్ లో ఓ మూండంతస్తుల భవనం భారీ వర్షాలకు, వరదలకు నాని, దెబ్బతిని కూలడానికి సిద్ధంగా ఉంది. గోడలన్నీ బీటలు వారాయి. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఈ భవనాన్ని అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో జనసేన నాయకులు స్పందించారు. భవనాన్ని సందర్శించిన అనంతరం తిరుపతి అర్బన్ ఎం.ఆర్.ఒ. ను సంప్రదించారు. ఆ భవనంలోని మూడు కుటుంబాలను ఖాళీ చేయించి వారికి తగిన వసతి కల్పించాలని కోరారు. అలాగే ఆ భవనం కూలితే చుట్టుపక్కల ఇళ్ల వారికి ప్రమాదం కాబట్టి వారికి కూడా ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విన్నవించారు. తరువాత ఆ భవనానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.