టోకురు :పేదల దోపిడీకి వన్ టైం సెటిల్మెంట్

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని జనసేన పార్టీ నాయకులు సాయిబాబా విమర్శించారు. అరకు నియోజకవర్గంలోని అనంతగిరి మండలం టోకురు పంచాయతీ పరిధి పిండూరువలస గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ వన్ టైం సెటిల్మెంటు పేరుతో ప్రభుత్వం కొత్త దోపిడీకి తెరతీసిందని అన్నారు. పేదల నడ్డి విరిచే ఈ చర్యను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న, ప్రజల పక్షాన పోరాడుతున్న జనసేన పార్టీకి అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *