జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం ఇన్చార్జి శ్రీ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో చేరికలు

ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్లరేవు మండలం, జార్జిపేట పంచాయితీ, ఎమ్ ఎల్ కె నగర్ లో రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో 100 మందికి పైగా ఎమ్మార్పీఎస్ యువకులు మరియు ఆటోరిక్షా కార్మికులు మహిళలు అధిక సంఖ్యలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ జనసేన తీర్థం పుచ్చుకోవటం జరిగింది. వీరందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.