రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుని కుటుంబానికి జనసేన ఆర్ధిక సాయం

చోడవరం మండలం, వెంకన్నపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు సయ్యద్ బాషా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ PVSN రాజు వారి కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరపున ₹20,500 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ గూనూరు సూర్యనారాయణ, చోడవరం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ గూనూరు మూలునాయుడు, ప్రధాన కార్యదర్శి శ్రీ అల్లం రామఅప్పారావు, చోడవరం టౌన్ పార్టీ అధ్యక్షులు శ్రీ కర్రి రమేష్, స్థానిక నాయకులు పూడి రాజేష్, నాగులాపల్లి శ్రీను, సతీష్ గుప్త, ఇతర ముఖ్య నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.