అంగరంగ వైభవంగా కృష్ణా జిల్లా జనసేన మండలాధ్యక్షుల ప్రమాణస్వీకారం

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 50 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు నియామకం మరియు ప్రమాణస్వీకార కార్యక్రమం గాయత్రి ఫంక్షన్ హాల్ నందు బుధవారం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు సంస్థాగత ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీలో ప్రతి జనసైనికులు ప్రాధాన్యం ఉంటుందని ప్రజలతో ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ అని కృష్ణాజిల్లా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తెలియజేశారు. కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షాలలో బలమైన పార్టీ ప్రజల నాడిని వినిపించి సమస్యల పరిష్కార దిశగా నడుస్తున్నా ఏకైక పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు. గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, అధిష్టానానికి ప్రజలకు మధ్య వారధిలా మండల అధ్యక్షులు నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు వంపుగడవల చౌధురి, మతి వేంకటేశ్వర రావు, దోవారి పవిత్ర, మచిలీపట్నం, మండల అధ్యక్షుడు గల్లా తిమోతి, బందరు టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఎండీ సమీర్ ఉరుమి సర్పంచ్ సురేష్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అభిమానులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండల అధ్యక్షులు శ్రీ వీరంకి వెంకటేశ్వరరావు(వెంకయ్య) ప్రమాణస్వీకార కార్యక్రమానికి మండలంలోని సింగరాయపాలెంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని, భారీగా కార్యక్రమం విజయవంతం చేయడానికి బయలుదేరిన, కైకలూరు నియోజకవర్గ మరియు ముదినేపల్లి మండల నాయకులు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ, కైకలూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బి.వి రావు, నియోజకవర్గ నాయకులు, ముదినేపల్లి మండల నాయకులు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.