ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కి గురైన జనసైనికుడికి మనోధైర్యాన్నిచ్చిన మండల జనసేన

వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామంలోని కేబుల్ వైర్ మరమ్మత్తుల నిమిత్తం కరెంటు స్తంభం ఎక్కి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్ కి గురైన జనసైనికుడు ముత్యాల సమేశ్ ను మండల జనసేన నాయకులు పరామర్శించడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఉంటే 50 వేల వరకు ఖర్చు పార్టీ భరించేదని, త్వరలో సభ్యత్వం అందుబాటులోకి వస్తుందని అప్పుడు అందరం నమోదు తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయి కృష్ణ, నాయకులు కోట్ల మోహన్ రెడ్డి, ముత్యాల నాగేంద్రప్రసాద్, సోడే గంగాధర్, ముత్యాల సాయి, సాయి కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.