అకాల మరణం చెందిన జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

మంగళగిరి, ఇప్పటం గ్రామం జనసైనికుడు సంజీవ్ శ్రీనివాస్ అకాల మరణం చెందగా ఆదివారం రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆ కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మరియు ఆ కుటుంబానికి పార్టీ తరపున భరోసా ఇచ్చి ఇప్పటం గ్రామం జనసైనికులు తిరుమల శెట్టి నరసింహ, తిరుమల శెట్టి శ్రీధర్, ఇంట్ల జగదీష్ మరియు గ్రామస్తులు చిల్లపల్లి శ్రీనివాస రావు చేతుల మీదగా కుటుంబానికి ఆర్థికసాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి విభాగం మెంబర్ చవ్వాకుల కోటేష్ బాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి రావిరామా, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి,చేనేత వికాసం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, దుగ్గిరాల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు ఈమని గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి పసుపులేటి సాయి చైతన్య, సీనియర్ నాయకులు దాసరి శివనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.