జనసేన పార్టీ సరిపల్లి గ్రామ కమిటీ ప్రకటన

పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలోని సరిపల్లి గ్రామంలో ఇంచార్జ్ చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు మండల ఆద్యక్షులు తోట రవి అద్వార్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తోట రవి మాట్లాడుతూ ప్రతీ జనసైనికుడు క్రమశిక్షణతో ఉండాలని పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలని కోరారు. ఆలాగే రేపు జరగబోయే మత్స్యకార అభ్యునతి సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి సర్పంచ్ గోపి, గ్రామ కమిటి అద్యక్షులు సత్తి పండు, ఉపాద్యక్షులు కొపుల రాజేష్ లు పాల్గొన్నారు.