అగ్ని ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చిన జనసేన

బుధవారం పారాదిలో జరిగిన అగ్ని ప్రమాదం దగ్ధమైన గుడిసెలు ఇల్లు ని సందర్శించిన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, రాష్ట్ర ఐటీ వింగ్ సతీష్ బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. రాత్రి 8 గంటలకు వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ మంటలు అదుపులోకి రాలేదు వెంటనే బాబు పాలూరు స్థానిక సిఐ కి ఫోన్ చేసి చెప్పిన వెంటనే స్థానిక ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి పంపించడం జరిగింది. స్పందించిన సిఐ కి, ఫైర్ స్టేషన్ సిబ్బందికి ధన్యవాదములు తెలపడం జరిగింది. అలాగే రాత్రి 8 నుంచి 12 గంట వరకు ప్రాంతంలో ఉండి మంటలు అదుపు చేసి వెళ్లడం జరిగింది బాధితులకు మేమున్నామని భరోసా కల్పించడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు సర్వం కోల్పోయిన వాళ్లకి అండగా ఉంటారని కోరుకుంటున్నామని తెలిపారు.