మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని జనసేన డిమాండు
మార్కాపురం జిల్లాగా ఏర్పాటు జనసేన డిమాండు చేస్తూ జేఏసి సభ్యులు, జనసెన పార్టీ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్బంగా, ఆయనకి మద్దతు తెలుపుతూ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ మరియు అర్ధవీడు మండల అధ్యక్షుడు కలగొట్ల అల్లురయ్య దీక్ష శిబిరం వద్దకు చేరుకుని పూలమాలతో సత్కరించింది, అభినందించడం జరిగినది. ప్రజలందరి కోసం ఆమరణ దీక్ష చేస్తున్న నాయకులకి ధన్యవాదములు తెలిపారు. జిల్లా కార్యదర్శి లంకా నరసింహా రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య మాట్లాడుతూ మార్కాపురం జిల్లా సాధించే వరకు ఆమరణ దీక్ష కొనసాగించాలని కోరడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-18-at-7.09.02-PM-1024x768.jpeg)