బండారు ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు చేయూత

కోనసీమ జిల్లా, ఆలమూరు మండలంలోని మడికి గ్రామం నందు సోమవారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో పలువురు కుటుంబాలను కలిసి వారి కష్టసుఖాలను, ఆరోగ్య వివరాలను, జనసైనికులు, కార్యకర్తల ద్వారా బండారు శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మడికి గ్రామం కొత్తపళ్లి నగేష్ సీనియర్ జనసేన నాయకులు, జడ్పిటిసిగా పోటీ చేసిన అభ్యర్థి నాయకత్వంలో, మడికి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న గంపా దుర్గాప్రసాద్ ను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ గ్రామ జనసైనికులు, మరియు మండల జనసేన నాయకులు కొత్తపళ్లి నగేష్ తో కలిసి పీపుల్స్ ఆఫ్ వాయిస్ జనసేన పార్టీ తరఫున పదిహేడు వేల 17,000/ రూపాయలను ఆర్థిక సహాయంగా గంప దుర్గాప్రసాద్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అదే గ్రామంలో ఉంటున్న ఆలమూరు మండలం మడికి గ్రామంలో ఇటీవల మరణించిన కోన స్వామి, గొడుతూ లక్ష్మణరావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్కరికి 50 కేజీల బియ్యం ప్యాకెట్లను చిరు సహాయార్థంగా బండారు శ్రీనివాస్ నాయకత్వంలో, ఆ కుటుంబాలకు కలిసి ఆ గ్రామ జనసైనికులు కార్యకర్తలు నగేష్ ఆధ్వర్యంలో అండదండలు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.