కోవెలకుంట్లలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సేవా కార్యక్రమాల స్ఫూర్తితో జనసేన పార్టీ నాయకులు పత్తి సురేష్, గుర్రప్ప, బోధనం ఓబులేసు, చిన్న కిట్టు, అభిలాష్, హర్ష ఆధ్వర్యంలో శుక్రవారం కోవెలకుంట్లలోని సంత మార్కెట్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని పట్టణప్రజలు అలాగె చుట్టుపక్కల గ్రామాల నుండి మార్కెట్ కు వచ్చే ప్రజలకు దాహం తీర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వేసవి కాలం ముగిసే వరకు ప్రతి శుక్రవారం మార్కెట్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ ప్రసాద్, నాగేంద్ర, భాస్కర్, సాయి జస్వంత్ పాల్గొన్నారు.