సింగరాయకొండ జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సింగరాయకొండ: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సలహాల మేరకు, శనివారం సింగరాయకొండ జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త మేడా రమేష్ నాయుడు చేతుల మీదగా సభ్యత్వం చేపించుకున్న ప్రతి ఒక్కరికి బీమా పత్రాలు అందేచేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ మాట్లాడుతూ కేవలం 500 రూపాయలతో సభ్యత్వం నమోదు తో ఐదు లక్షలు ఇన్సూరెన్స్ పథకం ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేపట్టలేదని అన్నారు. అంతేకాక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రతి గ్రామం లో ప్రతి మండలం నుండి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని, అంతేగాక పవన్ కళ్యాణ్ గారు పెట్టిన 7 సిద్ధాంతాలు గురించి వివరించి అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన క్రియాశీల సభ్యత్వం చేసిన వాలంటీర్స్ కి మేడా రమేష్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండలం అధ్యక్షులు శశిభూషణ్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు కాసుల శ్రీకాంత్, సింగరాయకొండ మండలం నాయకులు, దండే ఆంజనేయులు, దేవినేని బాలాజీ, కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు సయ్యద్ చాన్ బాషా పసుపులేటి శ్రీకాంత్, షేక్ సుల్తాన్ భాషా చలంచర్ల కరుణ్ కుమార్ అశోక్ అనిల్ మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.