కైకలూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
*కైకలూరు నియోజకవర్గ క్రియాశీలక సభ్యత్వం నమోదులో కొత్తపల్లి జనసైనికులు ముందంజ..
కైకలూరు: జనసైనికులు తరుచు ప్రమాదాలకు గురి అవుతుండడంతో.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందుచూపుతో.. అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు.. పార్టీ ప్రతి జనసేన కార్యకర్తకు అండగా ఉండాలన్న సదుద్దేశంతో.. ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన జనసేన క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రేడ్డి రామ్ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ తో పాటుగా వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం మండవల్లి గ్రామం శుభం ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజికవర్గంలోనే అత్యధిక సభ్యత్వాల చేసిన సుధాబత్తుల సాయిష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన నా తోటి కొత్తపల్లి జనసైనికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసారు. నియోజకవర్గంలోనే పార్టీ సేవకార్యక్రమాలు చేస్తూ, పార్టీ సిద్దాంతాలను ప్రజల్లో కి తీసుకునివెళ్తూ.. కైకలూరు నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో ఉంటూ.. ప్రతి కార్యక్రమంలోనూ కైకలూరు నియోజకవర్గం ముందంజలో ఉండేలా అన్ని గ్రామాల జనసైనికులు కృషి చేయాలని.. అలానే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ సత్తా ఏమిటో వైసీపీ పార్టీ, టిడిపి పార్టీకి చూపించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు.. ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమమునకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శిలు, జిల్లా కమిటీ సభ్యులు, నాలుగు మండలాల కమిటీ సభ్యులు, ఇతర కమిటీ ముఖ్య నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-12-at-2.40.44-PM-1024x542.jpeg)