గిరిజన గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా జనసైనికులు

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం మరియు సీతంపేట మండలంలో తుంబకొండ గిరిజన గ్రామంలో బుధవారం తమ వద్ద పార్టీ జెండాలు లు లేవని వారి సమస్యను తెలుపగా అల్లు సాయి స్పందించి వెంటనే జెండాలు పంపించడం జరిగింది. వాటిని పాలకొండ టౌన్ జనసైనికులు పోరెడ్డి ప్రశాంత్, పోట్నూరు రమేష్ కలిసి స్థానిక జనసైనికుడు దీపక్ కళ్యాణ్ కు పార్టీ జెండాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గిరిజన గ్రామాల్లో పార్టీ సిద్ధాంతాలను చాలా బలంగా తీసుకెళ్లి బాధ్యత ప్రతి జనసైనికుని మీద ఉందని ముఖ్యంగా కౌలు రైతులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న 30 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా మనం అందరం కలిసి కట్టుగా పనిచేయాలని తెలిపారు.