ముంబై వెర్సస్ కోల్‌కతా.. టాస్ గెలిచిన కోల్‌కతా

ఐపీఎల్ టోర్నీలో నేడు 32వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలోనే షేక్ జాయెద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకూ ముంబై ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కోల్‌కతా నాలుగింటిలో గెలుపొందింది. కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. బాంటన్, నాగర్ కోటిని పక్కనబెట్టి.. శివం మావి, క్రిస్ గ్రీన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇక ముంబై జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. పాటిన్సన్ స్థానంలో కౌంటర్‌నైల్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ నుంచీ కోల్‌కతాకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో కెప్టెన్సీ నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకున్నాడు.