గుంటూరు జనసేన పార్టీలో నూతన చేరికలు

గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో గుంటూరు కార్పోరేషన్ 12వ వార్డ్ లాలాపేట్ నుంచి యువత పార్టీలో చేరడం జరిగింది. వీరిని పార్టీ జెండా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరు వైసిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారు. వీరికి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగినది.

నూతనంగా పార్టీలోకి చేరిన ఎస్ కే. సమీర్, ఎస్ కే. బాజీ, ఎస్ కే.హఫీజ్, ఎస్ కే. సుభాని, పవన్ కుమార్, స్వరాజ్, పుష్పరాజ్, వంశీ, ఆర్య, చందు, హరి, అమర్నాథ్, సంతోష్, ప్రేమ్ కుమార్, జనార్ధన్, సత్య, చంద్రశేఖర్, సాయి, శాంతిరాజ్, రామకృష్ణ తదితరులు అనిల్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖాబాలు, సతీష్, మదులాల్, నెల్లూరి రాజేష్, తన్నీరు గంగరాజు, అన్నే.వెంకటేశ్వరరావు, మహంకాళి పాల్గొన్నారు.